విశాఖలో జరుగు ఏఐటీయూసీ జాతీయ సమ్మేళనాన్ని జయప్రదం చేయండి
రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి పిలుపు
మార్కాపురం: కార్మిక హక్కుల కోసం నిరంతరం రాజిలేని పోరాటాలను కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్న ఏఐటీయూసీ జాతీయ సమ్మేళనం సెప్టెంబర్ 1, 2, 3 తేదీలలో విశాఖ నగరంలో జరుగనుందని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ కార్మిక లోకానికి పిలుపు నిచ్చారు.గురువారం ఉదయం స్థానిక పూల సుబ్బయ్య శాంతిభవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 42 కార్మిక చట్టాలకు తూట్లు పొడిచిందని, అలాగే నూతనంగా నాలుగు లేబర్ కోడ్ లు తీసుకురావడం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు.అనేక పోరాటాలు, త్యాగాల ఫలితంగా సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసే అధికారం మోడీ ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. రైతు సంక్షేమమే తమ సంక్షేమమని పదేపదే ప్రకటించే బిజెపి ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొస్తుందని విమర్శించారు. లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే బిఎస్ఎన్ఎల్, రైల్వేలు, ఎల్ఐసి, హిందుస్థాన్ పెట్రోల్ కెమికల్స్, పౌర విమనయాన శాఖ, పోస్టల్ తదితర జాతి సంపదలను నష్టాల బాట చూపుతూ అంబానీ, ఆదానీ లకు కారు చౌకగా విక్రయిస్తుందని ఆయన తీవ్రంగా విమర్శించారు.
మోడీ ప్రభుత్వ హయాంలో కార్మిక సంక్షేమం అటుంచి కోల్పోతున్న హక్కుల గురించి పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన అవసరం నేడు ఏర్పడిందని ఆయన అన్నారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న తిరోగమన ఆర్థిక విధానాల పలితంగా లక్షలాది కుటీర పరిశ్రమలు మూతపడ్డాయని, దీని ఫలితంగా ఆయా రంగాలను నమ్ముకుని పని చేస్తున్న కోట్లాదిమంది కార్మికులకు జీవనోపాధి కోల్పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు .
విశాఖలో జరుగు ఏఐటీయూసీ జాతీయ సమ్మేళనానికి దేశంలోని దాదాపు 29 రాష్ట్రాల నుండి ప్రతినిధులు హాజరుకానున్నారని తెలిపారు. ఈ సమ్మేళనంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాల గురించి సమగ్రంగా చర్చించి భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను రక్షించుకునేందుకు పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నట్లు ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ అన్నారు.ఈ విలేకరుల సమావేశంలో నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి అందే నాసరయ్య, జిల్లా ఎఐటియుసి కార్యదర్శి ఎస్ కె కాశీం లు పాల్గొన్నారు.
About The Author
Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.