Category
State
State 

జమ్మూ కాశ్మీర్ లో భారీ ఎన్‌కౌంటర్

జమ్మూ కాశ్మీర్ లో భారీ ఎన్‌కౌంటర్ జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లాలో తాజాగా భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు టెర్రరిస్టులను మట్టుబెట్టాయి. ఓ నివాసంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో కాల్పులు జరిగాయి. భద్రతా బలగాల ఎదురు కాల్పుల్లో ఉగ్రవాదులు హతమయ్యారు. దీనికి సంబంధించిన డ్రోన్ విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Read More...
State 

ప్రధాని మోదీకి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ ఏలూరి

ప్రధాని మోదీకి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ ఏలూరి విజయవాడ: భారత ప్రధాని నరేంద్ర మోదీకి, ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకుడు డా. ఏలూరి రామచంద్రారెడ్డి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు‌ ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. దేశ సర్వతోముఖాభివృద్ధికి ఎల్లప్పుడూ అంకితభావంతో కృషి చేసే నాయకుడు మోదీ అన్నారు. ప్రజాసేవలో తరిస్తున్న ఆయన దీర్ఘాయుష్కుడై, ఆరోగ్యవంతుడై జీవించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అంటూ పేర్కొన్నారు. అంతేకాదు మోదీ యొక్క జీవితం అందరికీ ఆదర్శమన్నారు. ఆయన జీవిత వృత్తాంతం సరళమైన, సామాన్యమైన, అధ్యాత్మిక జీవనశైలికి నిలువెత్తు రూపం అన్నారు. అటువంటి నేత దేశ ప్రధానిగా ఉండటం భారత ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నామన్నారు. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది అంటే దానికి కారణం మోదీ అవలంబించిన విధానాలే అని గుర్తుచేశారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందిరితో ఆయన మెలిగే విధానం, స్పందించే గుణం.. ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా, విశ్వగురు గా నిలబెట్టాయన్నారు. అటువంటి గొప్ప నేత మళ్ళీ మళ్ళీ ప్రధాని కావాలని.. దేశం మరింత అభివృద్ధిని సాధించాలని కోరుకుంటున్నట్టు డాక్టర్ ఏలూరి తెలిపారు.
Read More...
State 

గుంటూరు మిర్చియార్డు కు సోకిన అవినీతి వైరస్‌

గుంటూరు మిర్చియార్డు కు సోకిన అవినీతి వైరస్‌ గుంటూరు: ఆసియా ఖండంలోనే అతి పెద్ద మిర్చి యార్డు గా పేరున్న గుంటూరు మిర్చి యార్డును కొందరు నేతలు, ఆ పార్టీ విధేయ అధికారులు అవినీతి వైరస్‌లా పట్టి పీడిస్తున్నారు. మార్కెట్‌ సెస్‌, జీఎస్​టీ, 'జీరో', కటింగ్‌, బిల్‌ టు బిల్‌ రూపాల్లో యార్డు ఆదాయానికి రూ. 700 కోట్ల రూపాయలకు పైగా గండి కొట్టారు. అందులో అధికారులు, సిబ్బంది కలిసి రూ. 150 కోట్ల వరకు దండుకున్నట్లు విజిలెన్స్‌ విచారణలో వెలుగు చూసింది. క్వింటాకు రూ. 20 వేల చొప్పున కొనుగోలు చేస్తే బిల్లుల్లో మాత్రం 10వేల చొప్పున కొన్నట్లుగా చూపిస్తారు. దీని పేరే కటింగ్‌ ఇలా ఏడాదికి క్వింటాకు రూ.10 వేల చొప్పున ఐదేళ్లలో రూ. 50 కోట్లకు పైగా గండికొట్టారు. సహకరించిన యార్డు యంత్రాంగానికి బస్తాకు 4, వేమెన్లకు 6 రూపాయల చొప్పున వ్యాపారులు ముట్టజెప్తున్నారు. ఒకరి పేరుతో లైసెన్సు ఉంటే దానిపై మరొకరు లావాదేవీలు చేయడమే 'బిల్‌ టు బిల్‌' అందులోనూ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారు. గత ప్రభుత్వంలో పాలకులు, వారికి వంత పాడిన అధికారులు ఈ అవినీతి వ్యవహారంలో నిండా మునిగినట్లు స్పష్టం అవుతోంది.
Read More...
Stories  State 

డిల్లీ అసెంబ్లీ రద్దు: మధ్యంతర ఎన్నికలు ఫిక్స్..!!

డిల్లీ అసెంబ్లీ రద్దు: మధ్యంతర ఎన్నికలు ఫిక్స్..!! న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. ఇంకో రెండు రోజుల్లో తన పదవికి రాజీనామా చేయబోతోన్నట్లు వెల్లడించారు.ప్రజలు మళ్లీ కొత్తగా ఓటు ద్వారా తీర్పు ఇచ్చేంత వరకూ తాను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబోననీ తేల్చి చెప్పారు. ప్రజలు ఎలాంటి తీర్పును ఇచ్చినా దానికి కట్టుబడి ఉంటానని, శిరసా వహిస్తానని అన్నారు. *ఎన్నికల తరువాతే..* ప్రస్తుతం ఆయన ఢిల్లీలో పార్టీ కేంద్ర కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఢిల్లీ అసెంబ్లీకి కొత్తగా ఎన్నికలను నిర్వహించిన తరువాతే తాను ముఖ్యమంత్రిగా ఆ సీటులో కూర్చుంటానంటూ అరవింద్ కేజ్రీవాల్ ప్రతిజ్ఞ చేశారు. *బెయిల్ తరువాత..* ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది. ఆయనకు బెయిల్ లభించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌తో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. *మనీలాండరింగ్ ఆరోపణలు..* ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు అరవింద్ కేజ్రీవాల్. సుమారు ఆరు నెలల పాటు తీహార్ జైలులో గడిపారు. బెయిల్ కోసం గతంలో చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఢిల్లీలోని రోస్ అవెన్యూ న్యాయస్థానం ఆయన బెయిల్ పిటీషన్లను ఎప్పటికప్పుడు తోసిపుచ్చుతూ వచ్చింది. చివరికి బెయిల్ కోసం కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. *బెయిల్ తరువాత తొలిసారి..* బెయిల్ లభించిన రోజు రాత్రే తీహార్ జైలు నుంచి విడుదల అయ్యారు అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, మంత్రి ఆతిషీ, ఎంపీ సంజయ్ సింగ్, ఇతర నాయకులు ఆయనకు సాదరంగా ఆహ్వానం పలికారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో స్వీట్లు పంచిపెట్టారు. బాణాసంచా కాల్చారు. *సచ్ఛీలత నిరూపించుకుంటా..* తాజాగా ఆయన పార్టీ నాయకులతో సమావేశం అయ్యారు. కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు సంధించారు. మద్యం పాలసీ కుంభకోణం, మనీలాండరింగ్ వంటి లేనిపోని ఆరోపణలు చేశారని, వాటిల్లో ఏ ఒక్కటి కూడా నిరూపితం కాలేదని అన్నారు. *కొత్త సీఎం ఎన్నిక..* బీజేపీ నాయకులు చేసినవన్నీ కూడా ఆరోపణలే అనే విషయాన్ని ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానని కేజ్రీవాల్ అన్నారు. అందుకే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోతోన్నానని, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. తాను నిజాయితీపరుడినని ప్రజలు భావిస్తే ఓటు వేస్తారని, అప్పుడే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటానని అన్నారు. కొత్త ముఖ్యమంత్రి ఎవరనేది రెండు మూడు రోజుల్లో నిర్ణయిస్తామని పేర్కొన్నారు.
Read More...
State 

సతీమణితో కలిసి స్టెప్పులేసిన మాజీమంత్రి..

సతీమణితో కలిసి స్టెప్పులేసిన మాజీమంత్రి.. వైసీపీ మాజీమంత్రి అప్పలరాజు శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక నిమజ్జన కార్యక్రమంలో డాన్స్ వేశారు.. తన సతీమణి తో పాటు కాలనీ వాసులతో కలిసి డీజే పాటకు మాజీమంత్రి డాన్స్ వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. నేటిజన్లు మాజీ మంత్రి డ్యాన్స్ పై తనదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు..
Read More...
State 

ఈ నెల 19న నూతన మద్యం పాలసీ నోటిఫికేషన్?

ఈ నెల 19న నూతన మద్యం పాలసీ నోటిఫికేషన్? ఏపీలో ఈ నెల 18న రాష్ట్ర క్యాబినెట్లో కొత్త మద్యంపాలసీ పై చర్చించి 19న నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అక్టోబర్ 1 నుంచి పాలసీని అమలు చేయాలని యోచిస్తోంది.ఆన్లైన్ లాటరీ ద్వారా షాపుల లైసెన్సులు జారీ చేయనుంది వైసీపీ హయాంలో ప్రభుత్వ పరిధిలో షాపులు ఉండగా, ఇకపై ప్రైవేటు వ్యక్తులకే అప్పగించే అవకాశం ఉంది. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందిస్తామని సీఎం మంత్రులు ప్రకటించిన విషయం తెలిసిందే.
Read More...
State 

ఖైరతాబాద్‌ మహాగణపతి దర్శనానికి పోటెత్తిన భక్తులు.. రద్దీగా మెట్రో స్టేషన్‌..!!

ఖైరతాబాద్‌ మహాగణపతి దర్శనానికి పోటెత్తిన భక్తులు.. రద్దీగా మెట్రో స్టేషన్‌..!! హైదరాబాద్‌ : ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. ఖైరతాబాద్ గణేశుడి దర్శనానికి ఎల్బీనగర్, మియాపూర్ నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో మెట్రో స్టేషన్ పరిసరాలు సందడిగా మారాయి.వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో ఖైరతాబాద్ గణేశుడికి భక్తుల తాకిడి పెరిగింది. దీంతో మెట్రో రైలు యాజమాన్యం భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తోంది. టికెట్ కౌంటర్లు, ఎగ్జిట్ గేట్ల వద్ద రద్దీ పెరగకుండా తగిన చర్యలు చేపట్టింది. క్యూఆర్ కోడ్ టికెట్లకు, కార్డ్ ద్వారా వెళ్లే ప్రయాణికులను వేర్వేరుగా పంపిస్తోంది. స్టేషన్ లోపల ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ ద్వారా ముందస్తుగానే టికెట్లు బుక్ చేసు కోవాలని, కార్డులో సరిపడా డబ్బులు లేకపోతే ఎంట్రీ స్టేషన్‌లో రీఛార్జ్ చేసుకోవాలని ప్రయాణికులకు సూచిస్తున్నారు. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్‌లో ఉదయం నుంచి గంట గంటకు రద్దీ పెరుగుతుండటంతో మెట్రో యాజమాన్యం అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. టికెట్ కౌంటర్లు, ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లతోపాటు ఫ్లాట్ ఫాం వద్ద భద్రతా సిబ్బంది ప్రయాణికులకు తగిన సూచనలు చేస్తున్నారు.
Read More...
State 

మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ని కలిసిన టెక్ స్టర్స్ ఎండీ సాయి జవ్వాజి

మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ని కలిసిన  టెక్ స్టర్స్ ఎండీ సాయి జవ్వాజి హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ని టెక్ స్టర్స్ ఎండీ జవ్వాజి సాయిక్రిష్ణ  కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.శనివారం కిరణ్ కుమార్ రెడ్డి నివాసంలో కలిసి, పుష్పగుచ్చం అందచేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ లో సీనియర్ నాయకులు గా ఉన్న మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ని పలువురు నాయకులు, ప్రముఖులు కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Read More...
State 

మాజీ సీఎం కిరణ్ ని కలిసిన డాక్టర్ ఏలూరి

మాజీ సీఎం కిరణ్ ని కలిసిన డాక్టర్ ఏలూరి Hyderabad: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో బీజేపీ రాష్ట్ర నాయకులు డా. ఏలూరి రామచంద్రారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.. ఈ సందర్బంగా మాజీ సీఎం కిరణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి వారిమధ్య చర్చకు జరిగినట్టు సమాచారం. కాగా డాక్టర్ ఏలూరి మాట్లాడుతూ.. మాజీ సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయనను కలిశానన్నారు.. కిరణ్ కుమార్ రెడ్డి గారు మంచి విజన్ కలిగిన నాయకుడు అన్నారు.. తనను ఎప్పుడు కలిసినా ఏపీ అభివృద్ధి గురించే మాట్లాడేవారని.. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడానికి తన శక్తి మేర కృషి చేస్తానని చెప్పేవారన్నారు.. కాగా ఆయన సీఎంగా ఉన్న కాలంలో పశ్చిమ ప్రకాశం జిల్లాలో చేసిన అభివృద్ధి పనుల గురించి కూడా ప్రస్తావనకు వచ్చినట్టు డాక్టర్ ఏలూరి వెల్లడించారు.
Read More...
State 

జనసేనలోకి బాలినేని?

జనసేనలోకి బాలినేని? విజయవాడ: వైఎస్ఆర్‌సీపీ ఓటమి తర్వాత ఆ పార్టీ నాయకులు ఒక్కొక్కరుగా జంప్ అవుతున్నారు. తాజాగా జగన్ సమీప  బంధువు, మాజీ మంత్రి, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీని వీడిపోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. రేపోమాపో ఆయన అధికారిక ప్రకటన చేయనున్నట్లుగా చెబుతున్నారు. పార్టీలో తనకు అవమానాలు ఎదురవుతున్నాయని కనీస మర్యాద ఇవ్వడం లేదని ఆయన అసంతృప్తిగా ఉన్నారు. కనీసం జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని ఇంత కాలం చెబుతూ వస్తున్నారు.తాను ఈవీఎంలపై చేస్తున్న పోరాటానికి మద్దతివ్వడం లేదని కూడా గతంలో పార్టీపై అసంతృృప్తి వ్యక్తం  చేశారు. వైసీపీ తరపున గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేల్లో యర్రగొండ పాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఒకరు. ఆయన బాలినేనికి సన్నిహితుడు. ఆయన సిఫారసు ద్వారానే సిట్టింగ్ గా ఉన్న మంత్రి ఆదిమూలం సురేష్ ను తప్పించి .. తాటిపర్తికి టిక్కెట్ ఇచ్చారు. ఇప్పుడు బాలినేని పార్టీ మారిపోతే ఆయన కూడా వెళ్తారన్న ఉద్దేశంతో.. పార్టీ ఆఫీసు నుంచి తాటిపర్తి చంద్రశేఖర్ కు పిలుపు వచ్చింది . జగన్ ఆయనతో మాట్లాడి.. పార్టీకి విధేయంగా ఉండాలని..  బాలినేనితో కలిసి నడవవొద్దని చెబుతారని అంటున్నారు. బాలినేనికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇస్తే.. ఆయన  పార్టీని చక్క బెడతారని పలువురు ప్రకాశం జిల్లా నేతలు ఇటీవలి కాలంలో జగన్  తో పాటు పార్టీ నేతల్ని కలిసి చెబుతున్నారు. అయితే అసలు  బాలినేనికి ఎలాంటి బాధ్యతలు ఇచ్చేందుకు జగన్ సిద్ధంగా లేరని తెలియడంతో ... ఆయనకు మరో మార్గం లేకుండా  పోయింది. ఇప్పుడు బాలినేనిని టీడీపీలోకి రానివ్వరు. బీజేపీలో చేరలేరు. పవన్ తో ఉన్న  సాన్నిహిత్యం దృష్ట్యా ఆయన జనసేనలో చేరుతారన్న ప్రచారం ఊపందుకుంటోంది. గతంలో కూడా  బాలినేనిపై ఈ ప్రచారం జరిగింది. అప్పట్లో ఖండించారు కానీ.. ఇప్పుడు ఖండించడం లేదు. తనను ఆ పార్టీలోకి వెళ్లాలని కోరుకునేవారు ఎక్కువగా ఉన్నారని అంటున్నారు.
Read More...
State 

భారీగా పెరగనున్న వంట నూనెల ధరలు!

భారీగా పెరగనున్న వంట నూనెల ధరలు! ముంబై: మధ్య తరగతి వంటింటి ఖర్చు ఇకపై మరింతగా పెరగనుంది. ముడి, రిఫైన్డ్ వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని కేంద్రం ఒకేసారి 20 శాతం వరకు పెంచడంతో ఆ మేరకు వంటనూనెల ధరలు పెరగనున్నాయి.పామాయిల్, సోయా, సన్‌ఫ్లవర్ సహా వివిధ రకాల నూనెలపై ఈ భారం పడనుంది. వీటి ముడి నూనెలపై ఇప్పటి వరకు సుంకం ఉండేది కాదు. అలాంటిది ఇప్పుడు ఏకంగా 20 శాతం విధించడంతో పేద, మధ్య తరగతి జేబులకు చిల్లు పడనుంది.రిఫైన్డ్ పామాయిల్, సోయా, సన్‌ఫ్లవర్ నూనెలపై గతంలో 12.5 శాతం దిగుమతి సుంకం ఉండేది. దీనిని ఇప్పుడు 20 శాతం పెంచి 32.5 శాతం పెంచింది. ముడినూనెలపై సుంకాన్ని 27.5 శాతానికి, రిఫైన్డ్ నూనెలపై కస్టమ్స్ డ్యూటీని 35.75 శాతానికి పెంచింది. ఈ నెల 14 నుంచే ఇది అమల్లోకి రానుంది. అదే సమయంలో ఉల్లిపాయలపై ఎగుమతి సుంకం సగం తగ్గింది. ప్రస్తుతం 40 శాతం కస్టమ్స్ డ్యూటీ విధిస్తుండగా దానిని 20 శాతానికి తగ్గించింది.
Read More...
State 

శ్రీశైలం దేవస్థానానికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ సర్టిఫికెట్

శ్రీశైలం దేవస్థానానికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ సర్టిఫికెట్ శ్రీశైలం: శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానానికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ సర్టిఫికెట్ లభించింది. ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి మరో అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. శ్రీశైలం ఆలయం విస్తీర్ణం అలానే ఆలయంలోని నంది విగ్రహానికి ఆలయ నిర్వాహణకు ఇంగ్లాండ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు లండన్ సంస్థలో స్థానం సంపాదించుకుంది. ముఖ్యంగా పురాతన పరంగా ఆధ్యాత్మికంగా సాంస్కృతి సంప్రదాయాలు ఆధ్యాత్మిక సత్యం యొక్క అత్యున్నత భాండాగారంతో కూడిన విలువలు గల సజీవ స్వరూపంగా పౌరాణిక ప్రాముఖ్యత కలిగి ఉన్నందుకు ఇంగ్లాండ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ లో శ్రీశైలం ఆలయం నమోదు కాబడింది. దీనితో శ్రీశైలం దేవస్థానం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు ధ్రువీకరణ పత్రం దక్కించుకుంది. ఈ ధ్రువీకరణ పత్రాన్ని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఆలయ ఈవో పెద్దిరాజుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ జాయింట్ సెక్రెటరీ ఉల్లాజీ ఎలియజర్ అందజేశారు....
Read More...