నేటి నుంచి 10 వ తరగతి పరీక్షలు
- 10 వ తరగతి పబ్లిక్ పరీక్షలకు సర్వం సిద్ధం
- - జిల్లాలో 183 పరీక్షా కేంద్రాలు
- - 29,602 మంది విద్యార్థులు
- - 9 ఫ్లయింగ్ స్క్వాడ్లు
- - హాల్ టికెట్ చూపిస్తే ఉచిత బస్సు ప్రయాణం
జిల్లాలో నేటి నుంచి ప్రారంభమవుతున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిం చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ తెలిపారు. జిల్లాలోని 618 పాఠశాలల నుంచి మొత్తం 20,602 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారని తెలిపారు.వారిలో 95 శాతం మంది ఇంగ్లీష్ మీడియం విద్యార్థులని చెప్పారు. పరీక్షకు 28,176 మంది ఇంగ్లీషు మీడియం, 1,428 మంది తెలుగు మీడియం,ముగ్గురు ఉర్దూ మీడియం విద్యార్థులు హాజరవుతారని చెప్పారు. కేవలం 100 మంది మాత్రమే ఒక సారి ఫెయిలైన విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారని, వారిలో బాలురు 14994 మంది,బాలికలు 14,808 మంది ఉన్నారని ఆయన తెలిపారు.విద్యార్ధులకు అందుబాటులో ఉండేలా మొత్తం 183 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, వీటిలో 6 పరీక్షా కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి వాటికి సీసీ కెమేరాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షా కేంద్రాలను నో ఫోన్ జోన్లుగా ప్రకటించామన్నారు. పరీక్షా కేంద్రాలలోకి సెల్ ఫోన్లను అనుమతించరని, పరీక్షా కేంద్రాల చీప్లు, ఇన్విజిలేటర్లు, పరీక్షా కేంద్రాల వద్ద విధులు నిర్వహించేవారు సెల్ పోన్లు తీసుకురా కూడదు అని తెలిపారు. స్క్వాడ్ అధికారులు, ఇతర అధికారులు పరీక్షా కేంద్రాలు తనిఖీ, పరిశీల తమ ఫోన్లను తమ వాహనాల్లోనే ఉంచి పరీక్షా కేంద్రాలలోకి రావాలని ఆయన అన్నారు. పరీక్షా కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలను అను మతించరని, స్మార్ట్ వాచ్లు, డిజిటల్ వాచ్లు, లాప్ టాప్లు, ట్యాబులు, కెమెరాలు, బ్లూటూత్ డివైజ్ లు, ఇయర్ ఫోన్లు, ఇయర్ ప్యాడ్లను పరీక్షా కేంద్రాల లోకి తీసుకురా కూడదన్నారు. ఉదయం 9:30 నుంచి 12.45 గంటల వరకు జరుగుతుందని, విద్యార్థులు అర్ధగంట ముందుగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత ఉదయం 9 గంటల నుంచి పరీక్షా కేంద్రాల లోకి అనుమతిస్తారని, బాలికలను క్షుణ్ణంగా తనిఖీ చేసేందుకు సచివాలయాల్లోని మహిళా పోలీసులను కేంద్రాల వద్ద ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
పరీక్షలలో కాపీయింగ్ను అరికట్టేందుకు 9 ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశామని ,అన్ని పరీక్షా కేంద్రాల పరిదిలో 144 సెక్షన్ విధించి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం అని తెలిపారు. పరీక్షా కేంద్రాలు పరిధిలోని జిరాక్స్ సెంటర్లు, ఇంట ర్నెట్ సెంటర్లను మూసివేస్తారన్నారు. పరీక్షల నిర్వహణను పరిశీలించేందుకు విద్యాశాఖ అదనపు డైరెక్టర్ ఏ.వి.సుబ్బారెడ్డిని రాష్ట్ర పరిశీలకులుగా నియమించారని, పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు సెట్-1, సెట్-2 లను పోలీస్ స్టేషన్లలోని స్ట్రాంగ్ రూములలో భద్రపరిచినట్లు చెప్పారు. పరీక్షల అధికారులు, సిబ్బంది అందరికీ ఇప్పటికే నియామకపు ఉత్తర్వులు అందజేశామన్నారు.
ప్రత్యేక నిఘా
పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేక నిఘాను పెట్టింది. నిర్వహణను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సైతం జిల్లాకు వచ్చి ఇతర జిల్లా అధికారులతో నేరుగా పరీక్షల నిర్వహ ణపై సమీక్ష నిర్వహించి డైర సమన్వయంతో పనిచేయా లని ఆదేశాలు జారీ చేశారని, మాస్ కాపీయింగ్ కు సహకరించినా, ప్రోత్సహం
చినా యాక్ట్ 25 ప్రకారం కఠిన చర్యలుంటాయని డిఈఓ కిరణ్ కుమార్ తెలిపారు. నేర తీవ్రతను బట్టి జైలు శిక్ష నుంచి లక్ష రూపాయల వరకు జరిమానా విధిస్తారన్నారు.
About The Author

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.