ఆ విషయంలో టీడీపీ ఫెయిల్...!
అమరావతి: ఏపీలో వంద రోజుల పాలన పూర్తి చేసుకుంది కూటమి ప్రభుత్వం. అయితే వంద రోజుల్లోనే కావాల్సినంత అపకీర్తి మూట గట్టుకున్నారు సీఎం చంద్రబాబు... అయితే అదంతా కేవలం సోషల్ మీడియాలోనే. అధికారంలోకి వచ్చిన తొలి రోజే ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టారు. మెగా డీఎస్సీ ప్రకటించారు.. పింఛన్ను రూ.వెయ్యి పెంచారు.. వివాదాస్పదమైన భూ హక్కు చట్టం రద్దు చేశారు.. రాజధాని అమరావతి ప్రాంతంలో పనులపై దృష్టి పెట్టారు.. ఏపీకి జాతీయ స్థాయి ప్రాజెక్టులు రాబట్టడంలో సఫలమయ్యారు.. వీటన్నిటితో పాటు రాజధాని అమరావతి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.15 వేల కోట్లు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. ఇక విజయవాడ వరదలను సమర్థంగా ఎదుర్కొన్నారు.. బాధితులకు అండగా నిలిచారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మొదలుపెట్టనున్నారు.. పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు.. అయితే ఇవన్నీ కూడా జనాలకు తెలియకుండా మభ్య పెట్టేందుకు వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని మాత్రం అడ్డుకోలేకపోతుంది కూటమి ప్రభుత్వం.ప్రస్తుతం సోషల్ మీడియా ఎంతో వేగంగా విస్తరిస్తోంది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్, ఇంటర్ నెట్ అందుబాటులోకి రావడంతో... ప్రతి చిన్న విషయం కూడా వెంటనే తెలిసిపోతుంది. దీనినే వైసీపీ నేతలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా సరే... ముందు దానిపై నెగిటివ్ ప్రచారం చేయడంలో మునిగిపోతున్నారు. ఉదాహరణకు రాజధాని అమరావతి ముంపు ప్రాంతమని ప్రచారం చేశారు... తర్వాత విజయవాడ కోసం రాజధానిని కాపాడారని వైరల్ చేశారు... తర్వాత అసలు అమరావతి ప్రాంతం రాజధానిగా పనికిరాదని పోస్టులు పెట్టారు.. ఇక తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కూడా దుష్పాచారం చేశారు. టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుగా ప్రచారం చేశారు. చివరికి టీటీడీ జేఈవో స్వయంగా రంగంలోకి దిగి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. వాస్తవానికి అభివృద్ధి వికేంద్రీకరణం అనేది చంద్రబాబు మాట. అందుకే 2014 ప్రభుత్వంలో రాయలసీమలో పరిశ్రమలు, ఉత్తరాంధ్రలో ఫార్మా హబ్, భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణం, కోస్తాంధ్రలో రాజధాని ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం వైసీపీ సోషల్ మీడియా మాత్రం... అమరావతిపై విషం చిమ్ముతోంది. కూటమి ప్రభుత్వం నిధులన్నీ అమరావతికే పెడుతోందని... ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను కనీసం పట్టించుకోవడం లేదని ప్రచారం చేస్తున్నారు. ఇక కూటమి అధికారంలోకి వచ్చిన తొలిరోజు నుంచి పచ్చ మీడియా, ఈవీఎం సీఎం అంటూ కామెంట్లు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి వారిపై కనీసం చర్యలు తీసుకోవడం లేదు. ఏదో ఒకరిద్దరిని అదుపులోకి తీసుకున్నా కూడా... స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేశారు. బయటకు వచ్చిన వాళ్లు... మళ్లీ అదే పనిగా కూటమి ప్రభుత్వాన్ని, వ్యక్తిగతంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. చివరికి ఆగస్టు 25 వరకు మహిళా కమిషన్ ఛైర్మన్గా వ్యవహరించిన వైసీపీ నేత గజ్జల వెంకటలక్ష్మి.. పదవీ కాలం ముగిసిన తర్వాత కూడా సీటు ఖాళీ చేయడం లేదు. పైగా ముఖ్యమంత్రి పైనే వ్యక్తిగత కామెంట్లు చేస్తూ వీడియోలు పోస్టు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా కూడా... కూటమి ప్రభుత్వం... ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కనీస చర్యలు తీసుకోవటం లేదు. దీంతో మహిళలపై కూడా నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారు కొందరు వైసీపీ కార్యకర్తలు.
About The Author
Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.