టీడీపీలో వారిదే పెత్తనమా....?

Special correspondent from Amaravati

On
టీడీపీలో వారిదే పెత్తనమా....?

అమరావతి: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది. నేతలంతా సంబరపడిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేనట్లుగా ఏకంగా 136 అసెంబ్లీ స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. అయితే గెలిచిన తర్వాత పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు మొదట్లోనే చెప్పిన మాటలను నేతలంతా పెడచెవిన పెట్టేసినట్లే తెలుస్తోంది. ఐదేళ్లుగా నేతలంతా అధికారం కోసం ఎన్నో పాట్లు పడ్డారు. ఇంకా చెప్పాలంటే... రెండేళ్ల పాటు గత వైసీపీ ప్రభుత్వం చేతిలో ఎన్నోసార్లు ఇబ్బందులు కూడా పడ్డారు. కొందరు నేతలు ఆర్థికంగా కూడా నష్టపోయారు. పార్టీ గెలిచిన తర్వాత పనులు చేసే అవకాశం దొరికిందని కొందరు నేతలు భావిస్తున్నారు. అయితే కొందరు కిందిస్థాయి కార్యకర్తలతో పాటు ఎమ్మెల్యేల చుట్టూ ఉందే మందిమార్భాలం వల్ల ఇప్పుడు పార్టీకి చెడ్డపేరు వస్తుంది కూడా.

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత, ప్రస్తుత ఎమ్మెల్యేకు చెందిన పీఏ సత్యనారాయణ తీరుపై స్థానిక టీడీపీ నేతలే విమర్శలు చేస్తున్నారు. ఎంతో కాలంగా ఎమ్మెల్యే దగ్గరే కొలువు చేస్తున్న సత్యనారాయణ... అన్ని రకాల వ్యాపారాల్లో వాటాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వైసీపీ నేతలతో కలిసి ఇసుక అక్రమ రవాణా, మద్యం వ్యాపారాలు చేశారంటున్నారు టీడీపీ నేతలు. ఇక ఎమ్మెల్యేను కలవాలంటే... ముందుగా సత్యనారాయణ అనుమతి కావాల్సిందే. పార్టీ కోసం ఎన్నికల్లో ఎంతో కష్టపడి పనిచేసిన నేతలకు కూడా ఎమ్మెల్యే దర్శన భాగ్యం కలగటం లేదంట. కాదు కూడదంటే... మంగళగిరి పార్టీ కార్యాలయానికి వచ్చినప్పుడో, లేదంటే ఏదైనా సమావేశం జరిగినప్పుడో ఆయనతో తమ సమస్యలు మొరపెట్టుకుంటున్నారు తప్ప... ఎమ్మెల్యే కార్యాలయంలో మాత్రం కలిసే అవకాశం దొరకటం లేదంటున్నారు నేతలు, కార్యకర్తలు. ఇలాంటి పీఏను ఎమ్మెల్యే తొలగించకపోతే పార్టీతో పాటు, ఆయన వ్యక్తిగతంగా తీవ్రంగా నష్టపోతారని సీనియర్ ఎమ్మెల్యేకు సూచిస్తున్నారు.

ఇక పల్నాడు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే పీఏపైన అయితే కావాల్సినన్ని ఆరోపణలు. తొలిసారి గెలిచిన సదరు ఎమ్మెల్యేకు ఆయన పీఏనే ఇప్పుడు సర్వస్వం. చివరికి కొడుకు, కూతుర్ని కూడా ఎమ్మెల్యే పక్కన పెట్టేశారంట. ఇదేంటయ్యా అంటే... పీఏ మాటే వేదం అంటున్నారు కిందిస్థాయి కార్యకర్తలు. ఎవరైనా మీడియా మిత్రులు వెళ్లినా కూడా ఎమ్మెల్యేను కలవటం సాధ్యం కావటం లేదు. అదేంటంటే... సార్ బిజీ అనేస్తున్నాడట సదరు పీఏ. గతంలో పోటీ చేసిన ఓడిన తర్వాత... ఐదేళ్ల పాటు అన్నా... మీరు లేకపోతే మేము లేమన్నా అన్న ఎమ్మెల్యే... ఇప్పుడు కనీసం ద్వితీయశ్రేణి నేతలను కూడా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చివరికి తిరుమల శ్రీవారి దర్శనం కోసం లేఖ కావాలని అడిగితే... అస్సలు ఖాళీ లేవు... అనేస్తున్నాడట. కానీ లేఖలను బయట విక్రయిస్తున్నాడనే మాట బలంగా వినిపిస్తోంది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు... వైద్యం కోసం వచ్చిన ప్రతి ఒక్కరికీ సాయం చేసిన సదరు ఎమ్మెల్యే గారు... ఇప్పుడు మాత్రం పీఏ చెప్పిన వారికి మాత్రమే పనులు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రకాశం జిల్లా కు చెందిన ఓ ఎమ్మెల్యే తీరుపై సొంత పార్టీ నేతలే గుర్రుగా ఉన్నారు. గెలిచింది రెండో సారే అయినా సరే... పార్టీలో సీనియర్ నేతలను ఏ మాత్రం లెక్క చేయడం లేదు అని, ఇదే ఆఖరు  అన్నట్లుగా సంపాదన పైన దృష్టి పెట్టారట. ఎమ్మెల్యే పేరు చెప్పుకుని... ఆయన వారసులు కావాల్సినంత దోపిడీలు చేస్తున్నారంటున్నారు. ఇక పశ్చిమంలో... త్వరలో జిల్లా కేంద్రం అవుతుందనే మాటతో ఊరి చుట్టూ రియల్టర్లు వెంచర్లు వేసేశారు. గతంలో వేలల్లో ఉన్న స్థలాల ధరలు ఇప్పుడు లక్షలకు చేరుకున్నాయి. దీంతో వెంచర్లకు కావాల్సిన మట్టిని ఊరి చెరువు నుంచి తోలేస్తున్నారు. ప్రతిరోజు రాత్రి 8 గంటల నుంచి జేసీబీలు, ప్రొక్లెయిన్లతో తవ్వకాలు చేపడుతూ ట్రాక్టర్లతో మట్టి తరలిస్తున్నారు. ఈ వ్యవహారం అంతా తెల్లవార్లు జరుగుతున్నప్పటికీ... అధికారులు మాత్రం కనీసం కన్నెత్తి కూడా చూసే ధైర్యం చేయటం లేదు. అందుకు కారణం.. ఈ మట్టి అక్రమ తవ్వకాల వెనుక అధికార పార్టీ నాయకుల పాత్ర పరోక్షంగా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే నియోజకవర్గం పరిధిలో ఉన్న మండలాలను కూడా తమ అనుచరులకు ఎమ్మెల్యే అప్పగించారనే మాట వినిపిస్తోంది. రేషన్ బియ్యం కొనాలన్నా, అమ్మాలన్నా సరే... ఆయా మండలాల్లో సదరు నేతలు చెప్పిందే వేదం అంటున్నారు నేతలు. టికెట్ వచ్చే వరకు అయ్యా, అమ్మా, అన్న, తమ్ముడు అంటూ తిరిగిన ఎమ్మెల్యే ... ఇప్పుడు గెలిచిన తర్వాత మాత్రం... నియోజకవర్గంలో ఉండటం లేదు. ఏదైనా పని కోసం ఎమ్మెల్యేను కలవాలంటే... నేతలంతా హైదరాబాద్ వెళ్లాల్సిందే. పరిస్థితి ఇలాగే కొనసాగితే... పార్టీకి కావాల్సినంత చెడ్డపేరు ఖాయమంటున్నారు కిందిస్థాయి నేతలు, కార్యకర్తలు. దీనిపై ఇప్పటికైనా సరే అధినేత దృష్టి పెట్టాలని కోరుతున్నారు.

Tags:

About The Author

RK Agni News Desk Picture

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.

Advertisement

Latest News

మార్కాపురం మెడికల్ కాలేజీ నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలి మార్కాపురం మెడికల్ కాలేజీ నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలి
విజయవాడ: పశ్చిమ ప్రకాశం జిల్లా అభివృద్ధి,వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి చేయుట,మార్కాపురం మెడికల్ కాలేజి నిర్మాణం , జిల్లాలో దొనకొండ ఇండస్ట్రియల్ క్యారిడర్, కనిగిరి నిమ్స్ పూర్తికి సహకరించమని...
డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన బాలినేని
నూతన మున్సిపల్ కమిషనర్ ను కలిసిన టిడిపి కౌన్సిలర్లు
అట్టహాసంగా డిసిసి అధ్యక్షుడు సైదా ప్రమాణస్వీకారం
తర్లుపాడు ఎస్ఐ గా బాధ్యతలు స్వీకరించిన బ్రహ్మనాయుడు
కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించిన నారాయణ
అగ్రికల్చర్ ఆఫీస్ లో పాము కలకలం