అట్టహాసంగా డిసిసి అధ్యక్షుడు సైదా ప్రమాణస్వీకారం
ఒంగోలు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలి
ఒంగోలు: పట్టణం లోనీ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం డీసీసీ అధ్యక్షునిగా షేక్ సైదా ప్రమాణస్వీకారం చేశారు. దానికి ముందు ఒంగోలు పట్టణం రంగారాయుడు చెరువు వద్ద ఉన్న ప్రకాశం పంతులు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సాయి బాబా గుడి వద్ద నుండి గద్దలగుంటలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు జిల్లా వ్యాప్తంగా తరలి వచ్చిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు పాలపర్తి విజేష్ రాజ్, కైపు వెంకట కృష్ణా రెడ్డి ఏర్పాటు చేసిన గజ మాల ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం పార్టీ ఆఫీసులో జరిగిన మీటింగులో మాజీ రాజ్యసభ సభ్యులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి నర్రెడ్డి తులసి రెడ్డి, షేక్ సైదా చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో షేక్ సైదా మాట్లాడుతూ తనకు ఇంత కీలక బాధ్యతకు అప్పచెప్పి పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలా రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేసారు. తన మీద పెట్టిన బాధ్యతకు పూర్తిగా తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను అని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా నరెడ్డి తులసి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి షేక్ మస్తాన్ వలీ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీపతి ప్రకాశం పాల్గొన్నారు. తులసి రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం లో షర్మిలా ని ముఖ్యమంత్రిగా అలాగే కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిగా చేసుకోవాలి అని పిలుపునిచ్చారు. దీని కోసం కాంగ్రెస్ శ్రేణులు అన్ని గ్రామ స్థాయి నుండి కష్టపడి రానున్న రోజుల్లో పనిచేయాలి అని చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కూటమి ప్రభుత్వం ఈ మొదటి 100 రోజులలోనే పూర్తిగా విఫలం అయ్యింది అని విమర్శించారు. వారు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామిలలో కేవలం ఒక్కటి మాత్రమే నేడు రాష్ట్రంలో అమలు అవుతుంది అని చెప్పారు. కూటమిలో ఇప్పటికే లుకలుకలు మొదలు అయ్యాయి అని, పవన్ కళ్యాణ్ కు, నారా లోకేష్ కి పొంతన కుదరట్లేదు అని, కూటమి త్వరలోనే కుప్పకూలబోతుంది అని తెలియజేసారు. వైసిపి పార్టీ కూడా పూర్తిగా బలహీన పడింది అని, ఆ పార్టీ నాయకులు అంతా ప్రత్యామ్నాయ నాయకత్వం కోసం చూస్తున్నారు అని, రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకీ పూర్వ వైభవం రాబోతుంది అని అన్నారు. మస్తాన్ వలీ మాట్లాడుతూ కేంద్రంలో అలాగే రాష్ట్రంలో దుర్మార్గపు పాలన సాగుతుంది అని విమర్శించారు. రాహుల్ గాంధీ సారధ్యంలో కాంగ్రెస్ పార్టీ దేశంలో జరుగుతున్న అన్యాయాల పట్ల పోరాటం చేస్తుంది అని, ఎన్డీఏ కూటమి పెంచిపోసిస్తున్న హింసా రాజకీయాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది అని తెలియజేసారు. రాహుల్ గాంధీ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఎన్డీఏ కూటమి సభ్యుల బెదిరింపుకు రాహుల్ గాంధీ భయపడరు అని, కాంగ్రెస్ శ్రేణులు అన్ని ఆయన వెనుక ఉన్నాయి అని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర అధ్యక్షులు తుర్కపల్లి నాగలక్ష్మి, సంతనూతలపాడు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పాలపర్తి విజేష్ రాజ్, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు సుదర్శన్, రైతు సంఘం నాయకులు చుండూరు రంగారావు, సీపీఐ వెంకట రావు, మైనారిటీ సంఘం నాయకులు షేక్ రఫీ, లోక్ సత్తా పార్టీ నాయకులు రఫీ, చిలకలూరిపేట కాంగ్రెస్ నాయకులు రాధా కృష్ణ, ప్రకాశం జిల్లా కాంగ్రెస్ నాయకులు ఉద్దండి మల్లికార్జున, ఉంగరాల శ్రీను , బొడ్డు సతీష్, ప్రసన్న రాజు, యూత్ కాంగ్రెస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రవీణ్, దరణాసి రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసరి రవి, జిల్లా ఉపాధ్యక్షుడు నాయాబ్ రసూల్, జిల్లా ప్రధాన కార్యదర్శులు కైపు కృష్ణా రెడ్డి, బాల కృష్ణ రెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రీహన్న భాను, ఎన్ఎస్ యుఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు బాల చంద్ర నాయక్, కాంగ్రెస్ పార్టీ ఎక్స సర్వీస్ మెన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తిరుమల నాయుడు, రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షులు సుదర్శి రవి తదితరులు పాల్గొన్నారు.
About The Author
Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.