బాబోయ్.. ఒక్క పదవికి ఇంత మంది పోటీ పడుతున్నారా....!

On
బాబోయ్.. ఒక్క పదవికి ఇంత మంది పోటీ పడుతున్నారా....!

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి చేసుకుంది. వాస్తవానికి ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో నేతలంతా నానా పాట్లు పడ్డారనేది వాస్తవం. కొందరు నేతలైతే.. జైలుకు కూడా వెళ్లారు. కొంతమందిని మానసికంగా వేధించింది గత వైసీపీ ప్రభుత్వం. దీంతో చాలా మంది సీనియర్లు రాజకీయాలకు దూరమయ్యారనేది వాస్తవం. అయితే కాలం కలిసి రావడంతో... 2024 ఎన్నికల్లో ఏపీలో కూటమి ప్రభుత్వం భారీ మెజారిటీతో విజయం సాధించింది. దీంతో సీనియర్ నేతలంతా ఇప్పుడు పదవుల కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. నామినేటెడ్ పదవుల కోసం కూటమి ప్రభుత్వంలో టీడీపీ నేతలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే అధినేత మాత్రం రేపు మాపు అంటూ వాయిదా వేస్తున్నారు. దీంతో కొన్ని పదవులకు పోటీ రోజురోజుకూ పెరిగిపోతుంది.

ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్ పదవి కోసం తెలుగుదేశం పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి ఓ మీడియా సంస్థ యజమాని బీఆర్ నాయుడు పేరు ప్రముఖంగా వినిపించింది. ఆయనకే ఖరారని పార్టీ నేతలు కూడా వ్యాఖ్యానించారు. అయితే ఇదే సమయంలో కొందరు ప్రముఖుల పేర్లు కూడా వినిపించాయి. మాజీ సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణతో పాటు చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకట్రావు, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు, బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి వంటి నేతల పేర్లు కూడా వినిపించాయి. అయితే ఇవన్నీ పుకార్లే అని కొట్టిపారేశారు. 

తాజాగా మరో ముగ్గురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందులో మొదటగా కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు కాగా... మరో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. వీరిద్దరితో పాటు ప్రముఖ నిర్మాత చలసాని అశ్వనీదత్ పేరు కూడా ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్తగా వ్యవహరిస్తున్న అశోక్ గజపతి రాజును జగన్ సర్కార్ ఎన్నో ఇబ్బందులకు గురి చేసింది. చివరికి విజయనగరం రామాలయం సందర్శనకు వెళ్లిన సమయంలో ఆయనపై కేసు పెట్టి అరెస్ట్ చేశారు పోలీసులు. సింహాచలం దేవస్థానం బోర్డు ఛైర్మన్ ఎంపిక విషయంలో నిబంధనలను తుంగలో తొక్కారు. విజయనగరంలో గజపతి రాజుల ఆస్తులకు తాళం వేశారు కూడా. దీనిపై చివరికి హైకోర్టు జోక్యంతో జగన్ సర్కార్ వెనక్కి తగ్గింది. దీంతో రాజకీయాలపై విసుగు చెందినట్లు ప్రకటించిన అశోక్... ఆయనకు బదులుగా కూతురు అదితి గజపతిరాజును ఎమ్మెల్యే ఎన్నికల బరిలో నిలిపారు. వివాదరహితునిగా గుర్తింపు తెచ్చుకున్న పూసపాటి అశోక్ గజపతి రాజుకు టీటీడీ ఛైర్మన్ పదవి ఇస్తే బాగుంటుందనేది ఉత్తరాంధ్ర నేతల మాట.

ఇక మరో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కూడా టీటీడీ బోర్డు ఛైర్మన్ పదవి కోసం ప్రయత్నం చేస్తున్నారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన తమకే పదవి ఇస్తే బాగుంటుంది అనే వాదనను తెరపైకి తీసుకువచ్చారు యనమల. అయితే యనమల కుటుంబానికి ఇప్పటికే నాలుగైదు పదవులిచ్చారు చంద్రబాబు. పైగా పార్టీ పోలిట్‌బ్యూరో మెంబర్‌గా కూడా కొనసాగుతున్నారు. దీంతో యనమలకు టీటీడీ బోర్డు ఛైర్మన్ పదవి కష్టమే అనే మాట కూడా వినిపిస్తోంది. చివరిగా నిర్మాత చలసాని అశ్వనిదత్ పేరు వినిపిస్తోంది. అయితే గతంలో చంద్రబాబు పిలుపు మేరకు విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన అశ్వనీదత్... ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే ఆయన స్నేహితుడు, ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు మాత్రం ఎస్వీబీసీ ఛానల్ ఛైర్మన్‌గా కొనసాగారు. దీంతో అశ్వనీదత్‌కు కూడా అవకాశం లేదంటున్నారు పార్టీ నేతలు.

Screenshot_2024-04-05-18-53-43-27_99c04817c0de5652397fc8b56c3b3817

Tags:

About The Author

RK Agni News Desk Picture

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.

Advertisement

Latest News

మార్కాపురం మెడికల్ కాలేజీ నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలి మార్కాపురం మెడికల్ కాలేజీ నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలి
విజయవాడ: పశ్చిమ ప్రకాశం జిల్లా అభివృద్ధి,వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి చేయుట,మార్కాపురం మెడికల్ కాలేజి నిర్మాణం , జిల్లాలో దొనకొండ ఇండస్ట్రియల్ క్యారిడర్, కనిగిరి నిమ్స్ పూర్తికి సహకరించమని...
డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన బాలినేని
నూతన మున్సిపల్ కమిషనర్ ను కలిసిన టిడిపి కౌన్సిలర్లు
అట్టహాసంగా డిసిసి అధ్యక్షుడు సైదా ప్రమాణస్వీకారం
తర్లుపాడు ఎస్ఐ గా బాధ్యతలు స్వీకరించిన బ్రహ్మనాయుడు
కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించిన నారాయణ
అగ్రికల్చర్ ఆఫీస్ లో పాము కలకలం