ఆ మంత్రి తీరు మారదా...? టీడీపీ నాయకుల్లో అంతర్మధనం

On
ఆ మంత్రి తీరు మారదా...? టీడీపీ నాయకుల్లో అంతర్మధనం

AP: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారినా సరే... ఆ మంత్రి తీరులో మాత్రం ఇప్పటికీ మార్పు రాలేదు. ఇప్పుడు ఇదే అంశం ఏపీ రాజకీయాలతో పాటు తెలుగుదేశం పార్టీలో కూడా హాట్‌ టాపిక్‌గా మారింది. 2014లో పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఎలాంటి పదవి లేకుండానే నేరుగా మంత్రి పదవి కొట్టేశారు. అది కూడా కీలక శాఖ చేపట్టారు. ఇదంతా కూడా పార్టీ గెలుపు కోసం తన వంతు కృషి చేశారని... ఆర్థికంగా అండగా ఉన్నాడనే చంద్రబాబు గుర్తింపు ఇచ్చారని... అందుకే ఆయనను కీలకమైన శాఖకు మంత్రిని చేసి... తర్వాత చట్ట సభలకు ఎంపిక చేశారనేది బహిరంగ రహస్యం. అయితే ఆ మంత్రి తీరు ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఎవరైతే ఆయనను తిట్టారో... ఎవరైతే పార్టీకి నష్టం కలిగించారో... ఎవరైతే ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారో... వారినే ఆయన ఏరి కోరి మరీ తెచ్చుకుంటారని.... కీలక పదవులిచ్చి పక్కనే పెట్టుకుంటారనే మాట బలంగా వినిపిస్తోంది. 

2014 - 19 కీలకమైన అమరావతి నగర నిర్మాణాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించారు సదరు మంత్రి. అయితే అప్పట్లోనే ఆయనపై నాటి ప్రతిపక్ష వైసీపీ నేతలు విమర్శలు కూడా చేశారు. అయినా సరే... చంద్రబాబు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా.. 2019 ఎన్నికల్లో ఆయనకు సింహపురి జిల్లాలో ఎమ్మెల్యే టికెట్‌ కూడా ఇచ్చారు. అయితే సదరు మంత్రి ఓడిపోయారు. అటు పార్టీ కూడా ఓడిపోవడంతో... నాటి మాజీ మంత్రి .. ఒక్కసారిగా ఫేడ్‌ అవుట్ అయ్యారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వ పెద్దలు... అమరావతిపై ఎన్ని ఆరోపణలు చేసినా సరే... ఆయన మాత్రం నోరు మెదపలేదు. పైగా మాజీ మంత్రి వియ్యంకుడు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారనే పుకార్లు షికారు చేసినా సరే... మాజీ స్పందించలేదు. ఇక అమరావతిలో భారీ భూకుంభకోణం జరిగిందని ఆరోపణలు చేసినా సరే... మూడు రాజధానులంటూ వైసీపీ అధినేత ప్రకటన చేసినా సరే... చివరికి అమరావతి రైతులు సింహపురి జిల్లాలో పాదయాత్ర చేసిన సమయంలో కూడా... నాటి మాజీ మంత్రి జాడ ఎక్కడా కనిపించలేదు. మాజీ మంత్రిని టార్గెట్‌ చేసిన వైసీపీ ప్రభుత్వం... చివరికి ఆయనపైన ఓ చీటింగ్ కేసు నమోదు చేసి అరెస్టుకు యత్నించింది. అప్పుడు మాత్రం తనను టార్గెట్‌ చేశారంటూ తెగ గగ్గొలు పెట్టారు. అయితే ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయనకు మాత్రమే మళ్లీ పాత శాఖను చంద్రబాబు కేటాయించారు. 

సదరు మంత్రి తిరిగి అమరావతి బాధ్యతలు చేపట్టిన తర్వాత మరోసారి వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. గతంలో ఆయన వద్ద పీఏగా, మీడియా ప్రతినిధులే చక్రం తిప్పారు. ఇప్పుడు కూడా మంత్రి సామాజిక వర్గానికి చెందిన మీడియా ప్రతినిధి కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే సదరు మీడియా మిత్రుడు... వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ వ్యతిరేక మీడియాలో కీలక స్థానంలో ఉన్నారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ పైన పార్టీ అధినేతతో పాటు ఇతర నేతలపైన కావాల్సినన్ని ఆరోపణలు చేశారు. పైగా ఎన్నికల సమయంలో వైసీపీకి అనుకూలంగా కూడా మీడియా ప్రతినిధిగా సాయం చేశారనే ఆరోపణలున్నాయి. అయినా సరే... సదరు వ్యక్తినే ప్రస్తుత మంత్రి స్వయంగా పిలిపించారట. పైగా ఆయన పక్కనే ఉండాలని కూడా ఆదేశించారట. దీంతో ఇదేక్కడి చోద్యం అంటూ టీడీపీ నేతలే ముక్కున వేలేసుకుంటున్నారు. 

మంత్రి వ్యవహార శైలి ఈ విషయంలోనే కాదని... ఆయన సొంత వ్యాపారాల్లో కూడా ఈ తరహాలోనే వ్యవహరిస్తారనేది ఉద్యోగుల మాట. ఆయన సంస్థలో ఎవరైనా ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలకు పాల్పడి.. పెద్ద మొత్తంలో అక్రమార్జన చేసి.. వెళ్లిపోయిన వారిని తిరిగి పిలిపించి... గతంకంటే ఎక్కువగానే వేతనం ఇవ్వడంతో పాటు.. కీలక పదవి కూడా ఇస్తారట. ఇదేంటని ఎవరైనా అడిగితే... నన్నే మోసం చేశాడంటే... వాటి తెలివి మామూలుగా లేదు కదా... ఇలాంటి వాళ్లు మన దగ్గరే ఉండాలి కదా అంటూ వింత జవాబు చెప్తారంట. దీంతో తొలి నుంచి నిజాయతీగా పని చేస్తున్న సిబ్బంది... ఇదేం ఆలోచనరా నారాయణా... అని ఏడుకొండల వాడికి మొర పెట్టుకుంటున్నారు. ఇంతకూ సదరు మంత్రి ఎవరో మీకు కూడా ఈ పాటికే తెలిసిపోయింది కదా...!

Screenshot_2024-02-14-16-51-16-09_99c04817c0de5652397fc8b56c3b3817

Tags:

About The Author

RK Agni News Desk Picture

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.

Advertisement

Latest News

చీకట్లో రోగులు.. చోద్యం చూస్తున్న అధికారులు చీకట్లో రోగులు.. చోద్యం చూస్తున్న అధికారులు
మార్కాపురం:  ప్రభుత్వ వైద్యశాలలో  కరెంటు లేక ఇబ్బందులు పడుతున్న రోగులు.ఉదయం 8 గంటల నుండి కరెంటు లేకపోవడంతో ఉక్కపోతతో రోధిస్తున్న వృద్ధులు,చిన్నారులు.వర్షాలు పడి కరెంటు వైర్లు కాలిపోయాయని...
నీట మునిగిన సత్యభామ యూనివర్సిటీ ...
హార్ట్ స్ట్రోక్ తో ఆర్టీసీ డ్రైవర్ మృతి
రన్ వే పై వరద నీరు... విమానం దారి మళ్లింపు
ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే!
గిద్దలూరు గుండెల్లో గుబులు రేపుతున్న సగిలేరు - పెరుగుతున్న వరద ఉధృతి
N.T.R జిల్లా లో రైస్ మిల్లు లో మంత్రి నాదెండ్ల తనిఖీ