ఆ విషయంలోనే కూటమిలో గొడవలు...!

On
ఆ విషయంలోనే కూటమిలో గొడవలు...!

అమరావతి: ఏపీలో కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల కోసం నేతలు ఎంతో ఆరాటంగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత... పదవులు దక్కుతాయని తెలుగుదేశం పార్టీ నేతలు గంపెడాశతో ఉన్నారు. ఇప్పటికే అధినేత చంద్రబాబుతో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు నానా పాట్లు పడుతున్నారు. ద్వితీయ శ్రేణి నేతల నుంచి టికెట్లు దక్కక భంగపడిన నేతలంతా ఇప్పటికే అధినేతను కలిసి పదవుల కోసం దరఖాస్తు చేసుకున్నారు కూడా. అవకాశం ఇవ్వాలని పార్టీ నేతలను కోరుతున్నారు కూడా. అయితే నామినేటెడ్ పదవుల ప్రకటనకు ప్రస్తుతం బ్రేక్ పడినట్లుగా తెలుస్తోంది. 

వాస్తవానికి నామినేటెడ్ పదవులు ఫలానా వారికే అంటూ సోషల్ మీడియాలో ఇప్పటికే రకరకాల జాబితాలు ప్రచారం అవుతున్నాయి. ఇంకా చెప్పాలంటే... ఎవరికి నచ్చిన పేర్లు వాళ్లు రాసుకుని మరీ జాబితాలు రిలీజ్ చేస్తున్నారు. తమ అభిమాన నేతలకే ఫలానా పదవి అని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇక మరికొందరైతే... జాబితా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అనేస్తున్నారు. కానీ... రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పదవుల భర్తీ వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రధానంగా ఎక్కువ పదవులు కావాలని బీజేపీ పట్టుబడుతోందని... అందుకే జాబితా విడుదలను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. నామినేటెడ్ పదవులను అక్టోబర్ నెలలో భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ టీడీపీ కూటమిలో చర్చ జరుగుతుంది. ప్రస్తుతం భర్తీ చేసే నామినేటెడ్ పదవులకు బీజేపీ మోకాలు అడ్డు వేయడంతో చంద్రబాబు తాత్కాలికంగా వాయిదా వేశారనే మాట వినిపిస్తోంది.నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో టీడీపీ-జనసేనలు సానుకూలంగానే ఉన్నా బీజేపీ మాత్రం తమకు ఎక్కువ ప్రాధాన్యత కావాలని పట్టుబడుతోంది. సీట్ల సర్దుబాటు సమయంలో ఇచ్చిన వాటితో సరిపెట్టుకున్నప్పటికీ...  నామినేటెడ్ పదవుల విషయంలో మాత్రం వెనక్కి తగ్గకూడదని కమలం పార్టీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం పది అసెంబ్లీ, 6 పార్లమెంట్ స్థానాల్లో మాత్రమే బీజేపీ అభ్యర్థులు పోటీ చేశారు. ఇందులో 3 పార్లమెంట్ స్థానాల్లో కమలం పార్టీ వికసించింది. 3 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఓడింది. అయినా సరే... నామినేటెడ్ పదవుల కేటాయింపులో మాత్రం సింహభాగం కావాలనేది బీజేపీ నేతల మాట.
మొత్తం అందుబాటులో ఉన్న పదవుల్లో తొలుత 30 నుంచి 50శాతం పదవుల్ని భర్తీ చేయాలని ఆ తర్వాత మిగిలిన పోస్టులు భర్తీ చేయాలని భావించారు. మొదట భర్తీ చేసే వాటిలో 50శాతం పదవుల్ని టీడీపీకి, 30శాతం జనసేనకు మిగిలినవి బీజేపీకి ఇవ్వాలని ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదనకు బీజేపీ విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. మరిన్ని పదవుల కోసం ఆ పార్టీ పట్టుబట్టడంతోనే నామినేటెడ్ పదవుల భర్తీ వాయిదా పడినట్టు తెలుస్తోంది. కీలకమైన టీటీడీ బోర్డు సహా పలు ప్రధాన పదవులను బీజేపీ నేతలు తమకు కావాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతానికి ఈ పంచాయతీని పక్కన పెట్టాలని చంద్రబాబు భావించినట్లు సమాచారం. అందుకే... వ్యవస్థలను గాడీలో పెడుతున్నామని... ముందుగా పరిపాలనను పట్టాలెకిస్తున్నమనే మాటను చంద్రబాబు తరచూ వాడుతున్నారు. అధికారులను బదిలీ చేయడం... పైనే ప్రధానంగా ఫోకస్ చేశారు కూడా. నామినేటెడ్ పోస్టుల ప్రకటన వాయిదా పడినట్లు తెలియడంతో... ఆశావహులంతా కాస్త డీలా పడిపోయారు.

IMG-20240709-WA0018

Tags:

About The Author

RK Agni News Desk Picture

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.

Advertisement

Latest News

చీకట్లో రోగులు.. చోద్యం చూస్తున్న అధికారులు చీకట్లో రోగులు.. చోద్యం చూస్తున్న అధికారులు
మార్కాపురం:  ప్రభుత్వ వైద్యశాలలో  కరెంటు లేక ఇబ్బందులు పడుతున్న రోగులు.ఉదయం 8 గంటల నుండి కరెంటు లేకపోవడంతో ఉక్కపోతతో రోధిస్తున్న వృద్ధులు,చిన్నారులు.వర్షాలు పడి కరెంటు వైర్లు కాలిపోయాయని...
నీట మునిగిన సత్యభామ యూనివర్సిటీ ...
హార్ట్ స్ట్రోక్ తో ఆర్టీసీ డ్రైవర్ మృతి
రన్ వే పై వరద నీరు... విమానం దారి మళ్లింపు
ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే!
గిద్దలూరు గుండెల్లో గుబులు రేపుతున్న సగిలేరు - పెరుగుతున్న వరద ఉధృతి
N.T.R జిల్లా లో రైస్ మిల్లు లో మంత్రి నాదెండ్ల తనిఖీ